Saturday, November 17, 2007

గుర్ర్ మన్న బుర్ర ..


అదేంటొ గాని కొన్ని నిర్ణయాలు మూకుమ్మడిగా జరిగిపోతాయి.

మన వీధిలో నే కాదు మనఊళ్ళో ,మనరాష్ట్రం లో మనదేశంలో,

ఎక్కడైనా రాయబడని న్యాయం .. తీర్పు చెప్పేస్తుంది.

ఘటనతో సంభంధం ఉండదు..

ఏ ఒక్కరి గురించో చెప్పటం లేదు...

సహజంగా మెజారిటీ ప్రజ..యూనిఫాం గా ఆలోచిస్తారు..

వినిపిస్తారు..నమ్ముతారు..వాదిస్తారు..

ఇక వాదనలో దిగితే..అంతే.

.అసలు విషయం పక్కకు పక్కకు పోతుంది..

పొంతన లేని సంభాషణే ......

ఎలా అంటారా..ఇప్పుడు ఓ పాదాచారిని సైకిల్ వాడు కొడితే..సైకిల్ వాడిదే తప్పు

..ఆ సైకిల్ ని ఓ స్కూటర్ కొడితె..స్కూటర్ వాడిదే తప్పు

ఆస్కూటర్ని..కార్ కొడితే..??ఆ కార్ ని బస్సు కొడితె..??

అక్కడా గుమి గూడె జనానికి సంఘటనపై అవగాహన లేకున్నా

కథలు .. కాకర కాయలు సొరకాయలు తెగ కోయడామే...తప్పెవరిదైనా కానీండి..ఆవరుసలో సపోర్ట్..

ఇంకో విషయం..ఆ ఏరియా గాని లోకల్ మనిషిగాని అయితే..

ఇంకోవిధంగా..వాళ్ళెప్పుడూ తప్పు చెయనట్టు..ఫోజులిచ్చి దెబ్బలాడుతారు..

ఇంక న్యాయం ఎలా జరుగుతుంది..???

ఒక చోటకులానికి, మరో చోట మతానికి, బంధుత్వానికి , స్నేహనికి , రౌడీలకు,

ఇలాసామాజిక న్యాయం నిర్ణయింప బడుతుంది..

అసలేం జరిగింది ?

తప్పెమిటిఎవరుచేసారు..

ఇవన్నీ వెనక బడి పోతాయి..న్యాయ అన్యాయాలతో సంభందం లేదు..

వాళ్ళవైపు న్యాయం.మనవైపు అన్యాయం..

ఏమిటీ మనస్తత్వం..

ఇంకో ఉదాహరణ..

ప్రజాస్వామ్యం , దేశాభక్తి , సెక్యులరిజం , కులవివక్ష ,మత సహనం , అంటూ అందరూ నీతులు చెప్పేటోళ్ళేపాటించేవారెవరు..???

కళ్ళెదుట అసెంబ్లీ లో జరిగేది తప్పుకాదు..అదే సామాన్య మనిషి చేస్తే తప్పు..

వారి మీద ఈగ వాలనివ్వరు..చట్టానికి అతీతులు..మనం బానిసలం..

జై కొట్టాలి జెండలు మోయాలి

ప్రజాస్వామ్యం వచ్చి ఇన్నేళ్ళయినా..ప్రజలకు స్వాతంత్రం ఇవ్వరు.

పదవి కొసం పడేపాట్లు ప్రజలకొసం పడరు..

మైనారిటీలు సాధించింది మెజారిటీ సాధించలేరు

అలోచించండి.. సమస్యలపై దృష్తిపెట్టి పరిష్కారాలు వెతకాలి కానీ..

ఎవడికో తప్పంటగట్టి..తూలనాడితే వచ్చేదెముంది..??

అసలు వీళ్ళు అసెంబ్లీ లో చేసేదేమిటి..??????

1 comment: