Thursday, February 28, 2008

అర్థ గిరి



చిత్తూరు జిల్లాలో తిరుపతి ,కాణిపాకం ,శ్రీ కాళహస్తి మాత్రమే కాక ఇంకా ఎన్నో ప్రసిద్ద స్థలాలున్నాయి.వీటిని చూట్టానికంటూ ప్రత్యేకంగా రాకపోయినా ,పై దేవాలయాలు సందర్శించినప్పుడు..
అటో ఇటో ఉండేవాటి గురించి చెప్పటమే నా ఉద్దేశం.
అలాంటిదే అర్థగిరి..
కాణిపాకం తిరుపతికి 60 కి.మైళ్ళదూరంలో ఉంది.
అక్కడికి ఓ పదిమైళ్ళ దూరంలో అరగొండ గ్రామానికి దగ్గరలో అర్థగిరి అనే ప్రదేశముంది. అరగొండ అన్నా ,అర్థగిరి అన్నా అర్థం సగం కొండ అనే.ఈ ప్రదేశంలో వీరాంజనేయస్వామి గుడి ఉంది.
స్థల పురాణం..
త్రేతాయుగంలో రామరావణ యుద్దం జరుగుతున్నప్పుడు
ఇంద్రజిత్తు చేతిలో లక్ష్మణుడు మూర్చిల్లుతాడు.అప్పుడు హనుమంతుడు సంజీవని పర్వతాన్ని కూకటివేళ్ళతో పెకలించి తెస్తాడు అని అందరికీ తెలుసు. మరి తెలియందేంటంటే అందులో కొద్దిభాగం విరిగి జారి ఇక్కడ పడిందని.
అలా పడ్డప్పుడే కొండమీద ఓ సరస్సేర్పడింది.అందులో నీళ్ళు తాగితే ,అన్ని రోగాలు నయమౌతుందని ఇక్కడి ప్రజల నమ్మకం.
ముఖ్యంగా ఇందులో ఎన్నో ఔషధాలు ఉన్నాయని అందరి విశ్వాసం.ఇక్కడి గుడిని చోళరాజులు నిర్మొంచారని చెబుతారు.ఒకప్పుదు ఓ చిన్న గుడి తప్ప ఇంకేమీ లేదిక్కడ.ఇప్పుడు ప్రయాణికులకోసం రోడ్డ్లు,వసతిగృహాలు,మొ..నవి వెలిశాయి.

1 comment:

Anonymous said...

Read telugu blogs from your cell phones. Click for more details blogkut

::Please remove word verification for commenting::